మహేష్ మూవీలో అది ప్రశ్నార్థకమేనా….!

-

పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్నారు సర్కారువారి పాట మూవీ. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్ ప్లస్ సంస్థలు మూవీని నిర్మిస్తున్నాయి. మహేష్, కీర్తీ సురేష్ నాయకానాయకులుగా చేస్తున్న మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి నాటికి సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2019లో ఈ మూవీ గురించి చర్చకు వచ్చింది. వరుసగా రెండుసార్లు కోవిడ్ ఎఫెక్ట్ వల్ల సినిమా నిర్మాణం ఆలస్యమైంది. భారీ అంచనాల మధ్య సినిమా నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు.

మహేష్ బాబు నుంచి మంచి ఫైట్లతో పాటు కీర్తీ సురేష్ అందాల విందుతో సినిమాతో మరింత రంజుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నారు. మహేష్ బాబుతో నటించే సినిమా అంటేనే ఎప్పుడూ సూపర్ హిట్ అని టాక్ ఉండనే ఉంది. అలాంటి సినిమా హిట్ అయితే తెలుగులో తన కెరీర్‌కు తిరుగు లేకుండా ఉండాలని హీరోయిన్ కీర్తీ భావిస్తోంది. కోవిడ్ కారణంగా సినిమాల షూటింగ్ కు దూరంగా ఉన్న మహేష్‌…. సర్కారువారి పాట సినిమాతో బిజీ అయ్యారు. సినిమా షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించినున్న అలనాటి హీరో అర్జున్ ఉన్నారా లేరా అన్నది ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news