ప్రజలను వెర్రివాళ్ళను చేసిన మంచు బ్రదర్స్.అసలు నిజం ఇదే..!

-

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మంచు వారి ఇంట్లో వివాదం అంటూ వార్తలు, వీడియోలు తెగ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. పైగా ఈ వీడియోలను మంచు మనోజ్ నెట్టింట షేర్ చేయడంతో కొంతమంది విష్ణు పై ఆగ్రహించగా మరికొంతమంది కుటుంబ పరువు బయట పెట్టుకుంటారా అంటూ మనోజ్ పై కూడా కోపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి అంటూ కామెంట్లు కూడా వినిపించాయి. అయితే మంచు విష్ణు, మనోజ్ గొడవ విషయంలో ఇప్పుడు ఒక పెద్ద ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

అయితే ఇది అసలు నిజమైన గొడవ కానే కాదు.. అదంతా ఫ్రాంక్ వీడియో అంటూ స్వయంగా మంచు విష్ణునే ప్రకటించాడు. అవును ఇది నిజం కాదట. అదొక రియాల్టీ షో కోసం చేసిన వీడియో అని అధికారికంగా ప్రకటించారు విష్ణు.. మంచు ఫ్యామిలీ త్వరలోనే ఒక రియాల్టీ షోని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుందట. దానికి “హౌస్ ఆఫ్ మంచూస్” అనే పేరు కూడా పెట్టారు. ఇందుకు సంబంధించిన ఒక టీజర్ ని మంచు విష్ణు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ కూడా షేర్ చేశారు.

ఇది కేవలం ఆరంభం మాత్రమే అనే కొటేషన్ కూడా పెట్టారు విష్ణు.. త్వరలోనే ఒక ప్రముఖ ఓటీటీ వేదికగా ఈ రియాల్టీ షో స్ట్రీమ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒకింత సంతోషం వ్యక్తం చేసినా.. ప్రజలను పిచ్చివాళ్లను చేసారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే మంచు ఫ్యామిలీ గట్టిగానే ప్లాన్ చేస్తోందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news