పాపులర్ లిస్ట్​లో రామ్​చరణ్ నంబర్ వన్.. పడిపోయిన కోహ్లీ బ్రాండ్ వాల్యూ

-

గ్లోబర్ స్టార్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన గుర్తింపు సాధించారు. ఐడీఎమ్​బీ విడుదల చేసిన ‘పాపులర్​ ఇండియన్ సెలెబ్రిటీస్​’ జాబితాలో ఈ వారానికి గానూ చరణ్ నంబర్ వన్ ప్లేసును సొంతం చేసుకున్నారు. రామ్​ చరణ్​ తర్వాతి రెండు స్థానాల్లో బాలీవుడ్ అందాల భామలు దీపికా పదుకొణె, ఆలియా భట్​ నిలిచారు. నాల్గో ప్లేస్​లో నిమ్రత్​ కౌర్, ఐదో స్థానంలో ప్రియా బెనర్జీ, ఉన్నారు. మరో ఆర్​ఆర్​ఆర్​ స్టార్ యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ ఆరో ప్లేస్​ దక్కించుకున్నారు.

మరోవైపు.. మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీ లిస్ట్​లో ప్రముఖ బాలీవుడ్​ నటుడు రణ్​వీర్​ సింగ్.. క్రికెటర్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి.. భారత్​లో అత్యంత విలువైన సెలెబ్రిటీగా అవతరించాడు. 2022లో కోహ్లీ కనబర్చిన పేలవ ప్రదర్శనే.. అతడి బ్రాండ్​ విలువ పడిపోవడానికి కారణమని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాని వల్ల 2021లో 185.7 మిలియన్​ డాలర్లుగా ఉన్న అతడి బ్రాండ్​ వాల్యూ.. 176.9 మిలియన్లకు పడిపోయినట్ల సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news