సినీ ఇండస్ట్రీ అన్నం పెట్టలేదు : నటి ఐశ్వర్య షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

-

ఇటీవల కాలంలో వచ్చే నటీనటులతో పోల్చుకుంటే అప్పట్లో ఎంతో మంది కేవలం సినిమాల్లో నటించాలన్న కారణంతోనే ఎక్కువగా పారితోషకం తీసుకోకపోయినా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకునే వారు. సినిమాల కోసమే పని చేసిన ఎంతోమంది ఇప్పుడు ఇండస్ట్రీకి దూరం కావడం చాలా బాధాకరం అని చెప్పాలి. అలాంటి వారిలో ప్రముఖ సీనియర్ నటి లక్ష్మి కుమార్తె ఐశ్వర్య కూడా ఒకరు అని చెప్పవచ్చు. ఇక నటి ఐశ్వర్య ప్రస్తుతం ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఆమె రోజు వారి పోషణ కోసం సబ్బులు అమ్ముకుంటున్నట్లు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.90s actress Aishwarya's dance video with her pretty daughter goes viral - Tamil News - IndiaGlitz.com

సుమారుగా 200 చిత్రాలలో నటించిన ఐశ్వర్య న్యాయంగళల్ జయిక్కట్టుం అనే సినిమా ద్వారా ఈమె వెండితెరకు పరిచయం అయింది. ఇక ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి హీరోయిన్ గా నటించ లేకపోయినా చిన్న చిన్న పాత్రల్లో నటించి బాగా ఆకట్టుకుంది. ఇక ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె పాల్గొని తన ఆర్థిక కష్టాలను కూడా వెల్లడించింది . ప్రస్తుతం రోజు గడవడం కష్టం కావడంతో ఇంటింటికి వెళ్లి సబ్బులు విక్రయిస్తున్నట్లు చెప్పింది. ఇకపోతే ఆమె మాట్లాడుతూ ఇప్పుడు నాకు పని లేదు. ఆదాయం కూడా లేదు.Telugu Actress Aishwarya Lakshmi Family Images | Actress Lakshmi's Daughter | Tollywood Updates - YouTube

ఇల్లు గడవాలంటే ఏదైనా పని కావాలి . ఇక సినిమాల్లో అవకాశాలు లేక ఇంటింటికి వెళ్లి సబ్బులు అమ్ముకుంటున్నాను. ఇక ఇప్పుడు నేను చేస్తున్న పని ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు అప్పులు లేవు. ఇతర సమస్యలు కూడా లేవు. సరైన పని మాత్రమే లేదు. నా ఆర్థిక పరిస్థితులు మారాలి అంటే కచ్చితంగా నాకు ఒక మెగా టీవీ సీరియల్ కావాలి.. నేను బతికింది సీరియల్స్ ద్వారా నే.. సినిమాల వల్ల కాదు.. సినిమాలు నాకు అన్నం పెట్టలేదు.. బుల్లితెర మాత్రమే అన్నం పెట్టింది అంటూ ఎమోషనల్ అయింది ఐశ్వర్య. ఇక మొత్తానికి ఐశ్వర్య కష్టాలు తెలుసుకొని ప్రతి ఒక్కరు చెలించిపోతున్నారు. ఇకనైనా ఈమెకు బుల్లితెరపై అవకాశాలు వస్తాయో లేదో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news