సినీ ఇండస్ట్రీలోకి ధోని…. ఆమెతోనే మొదటి సినిమా..!

-

మహేంద్ర సింగ్ ధోని ప్రత్యేకంగా పరిచయం అక్కర లేని పేరు. బహుశా ఇండియన్ క్రికెట్ హిస్టరీలో సచిన్ టెండూల్కర్ తరువాత అంతటి పేరు సంపాదించిన వ్యక్తి ఎంఎస్ ధోనీనే. ఇండియన్ క్రికెట్ లో విజయవంతమైన కెప్టెన్ గా, ఆటగాడిగా మిస్టర్ కూల్ పేరు సంపాదించుకున్నారు. వందల కోట్ల విలువైన బ్రాండ్ల ఎండార్స్మెంట్లు ధోని సొంతం. ప్రస్తుతం ఐపీఎల్ లో కూడా ధోని తన సత్తా చాటుతున్నాడు. ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్న ధోనికి… తమిళనాడు సెకండ్ హోమ్ గా మారింది.  

అయితే తాజాగా మరో ఫీల్డ్ లోని ధోని ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ ఫిలిం ఇండస్ట్రీ కోలీవుడ్ లో ఓ సినిమాను నిర్మిస్తున్నాడనే సమాచారం. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయినగా నటిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత దీనిపై మహేంద్రుడు అధికార ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news