వినోదమే ప్రధానమంటున్న చిరంజీవి..త్రివిక్రమ్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్?

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విదేశాల నుంచి ఇంటికి తిరిగొచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాల షూటింగ్స్ పైన ఫోకస్ పెట్టనున్నారు. కాగా, చిరంజీవి సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సదరు న్యూస్ ప్రకారం..మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ సీరియస్ రోల్స్ అని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన ‘ఆచార్య’లో ‘కామ్రేడ్ ఆచార్య’గా వెరీ సీరియస్ రోల్ ప్లే చేశారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఇక ఆ తర్వాత చేస్తున్న ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్, వాల్తేరు వీరయ్య’ చిత్రాలన్నిటిలో చిరంజీవి వెరీ సీరియస్ రోల్స్ ప్లే చేస్తున్నారట.

ఈ నేపథ్యంలోనే చిరంజీవి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది. తన బలమైన వినోదంనే హైలైట్ చేస్తూ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా సినిమా ఉండాలని చిరంజీవి డిసైడ్ అయ్యారని టాక్.

గతంలో చిరంజీవి ‘జై చిరంజీవ’ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. అవి థియేటర్లలో బాగా పేలడమే కాదు..జనాలకు విపరీతంగా నచ్చాయి. ఈ క్రమంలోనే చిరంజీవి-త్రివిక్రమ్ కాంబోలో వచ్చే పిక్చర్ ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఈ విషయమై త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. ఒకవే ళ అనౌన్స్ మెంట్ వస్తే మెగా అభిమానులకు ఇక పండుగే అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news