శ్రియ సినిమాలో సింగర్ గా నిత్యా మీనన్..

-

తెలుగులో పాన్ ఇండియా సినిమాల జోరు బాగా పెరిగింది. బాహుబలి ఇచ్చిన స్ఫూర్తితో వరుసగా పాన్ ఇండియా సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. తాజాగా హీరోయిన్ శ్రియ ప్రధాన పాత్రలో గమనం అనే టైటిల్ తో సినిమా తెరకెక్కుతోంది. మొన్నటికి మొన్న శ్రియ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రంలో నిత్యామీనన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.

గమనం సినిమా నుండి నిత్యామీనన్ లుక్ ని విడుదల చేసారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నిత్యామీనన్, క్లాసికల్ సింగర్ గా కనిపించనుంది. ఈ మేరకు పాత్ర పేరు శైలపుత్రి దేవిగా పరిచయం చేసారు. హీరో శర్వానంద్ చేతుల మీదుగా నిత్యామీనన్ పోస్టర్ ని చేసారు. క్లాసికల్ సింగర్ గా సంప్రదాయబద్దమైన వస్త్రాధారణలో ఏదో రాగాన్ని ఆలాపిస్తూ కూర్చున్న నిత్యామీనన్ లుక్ అందరినీ ఆకర్షించింది.

ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆసక్తి రేపిన గమనం చిత్రబృందం నిత్యామీనన్ లుక్ రిలీజ్ చేసి ఆసక్తిని మరింత పెంచారు. పాన్ ఇండియా రేంజ్ లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి సుజనా రావ్ దర్శకత్వం వహిస్తున్నారు. రమేష్ కురుటూరి, జ్ఞానశేఖర్, వెంకీ పుషాడపు నిర్మాతలుగా క్రియా ఫిలిమ్ కార్ప్, కాళీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోంది

Read more RELATED
Recommended to you

Latest news