ఇందులో చంద్రన్న.. అందులో రాజన్న ఇద్దరు ఒకరే..!

-

బయోపిక్ సినిమాల హవా కొనసాగుతున్న టాలీవుడ్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా రెండు వర్షన్స్ వస్తున్నాయి. బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు పార్టులుగా వస్తుంది. ఆల్రెడీ మొదటి పార్ట్ కథానాయకుడు రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. మహానాయకుడు శుక్రవారం అనగా రేపు రిలీజ్ అవుతుంది.

ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా ఆర్జివి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఎన్.టి.ఆర్ అసలు కథ అంటూ వర్మ ఈ సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాల్లో ఒక నటుడు ఒక సినిమాలో రాజశేఖర్ రెడ్డిగా నటిస్తుండగా.. మరో సినిమాలో చంద్రబాబు నాయుడిగా నటించాడు.

ఎన్.టి.ఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలో చంద్రబాబు నాయుడిగా రానా నటిస్తున్నాడు. అయితే ఆ సినిమాలో రాజశేఖర్ రెడ్డిగా శ్రీతేజ్ నటించాడు. ఇక లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ లో చంద్రబాబుగా కూడా శ్రీతేజ్ నటించడం విశేషం. వర్మ డైరెక్ట్ చేసిన వంగవీటి సినిమాలో నటించిన శ్రీతేజ్ ఎన్.టి.ఆర్ బయోపిక్, లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ఈ రెండు సినిమాల్లో ఇద్దరు మహానాయకుల పాత్రల్లో నటించి మెప్పించనున్నాడు. మరి అతని కెరియర్ కు ఈ పాత్రలు ఎలా హెల్ప్ అవుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news