హౌరా బ్రిడ్జ్ మీద ఎన్టీఆర్, చరణ్ ఢీ..!

-

బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అసలు ఎన్.టి.ఆర్, రాం చరణ్ లను ఒకే సినిమాలో నటించేలా చేయడంలోనే రాజమౌళి సక్సెస్ అయినట్టు. మెగా నందమూరి మల్టీస్టారర్ గా వస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 3వ షెడ్యూల్ కు కోల్ కత్తా వెళ్తుంది. అక్కడ చరణ్, ఎన్.టి.ఆర్ లకు సంబందించిన సీన్స్ షూట్ చేస్తారట. హౌరా బ్రిడ్జ్ మీద కూడా వీరిద్దరి సీన్స్ ఉంటాయట. ఈ సన్నివేశాలు సినిమాలు హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తుంది. హౌరా బ్రిడ్జ్ మీద వచ్చే ఈ సీన్స్ లో ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు తమ టాలెంట్ చూపేలా ఉంటుందట.

పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో చరణ్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపిస్తుండగా ఎన్.టి.ఆర్ బందిపోటు దొంగగా నటిస్తున్నాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.పరిణీతి చోప్రా, అలియా భట్ ల పేర్లు వినిపిస్తున్నా వారిద్దరు భారీ రెమ్యునరేషన్ అడుతున్నారట. హీరోయిన్స్ ఇద్దరు 10 కోట్ల దాకా అడుగుతున్నారట. అందుకే రష్మిక, కియరా, కీర్తి సురేష్ లను తీసుకోవాలని ఆలోచిస్తున్నాడట రాజమౌళి. 2020 సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news