బ్రేకింగ్ న్యూస్: టీడీపీకి షాక్… వైసీపీలోకి నటి జయసుధ..!

-

త్వరలో దేశమంతా ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఏపీలో మాత్రం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రోజు రోజుకీ వేడెక్కుతున్నాయి. దేశ ప్రజలంతా ఏపీ రాజకీయాల పైనే దృష్టి కేంద్రీకరించారు.

ఎందుకంటే ఏపీలో రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయి. ఇప్పటికే అధికార టీడీపీకి ఝలక్ ఇస్తూ పలువురు వైసీపీలో చేరారు. రాజకీయ నాయకులే కాదు సినీ ప్రముఖులు కూడా వైసీపీలో చేరుతున్నారు. తాజాగా శ్రీ వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ. కండువాకప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన జననేత వైయస్ జగన్.

ఆమె 2009 లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరుపున. ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 లో అదే సికింద్రాబాద్ నుంచి. పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2016 లో టీడీపీలో చేరారు. అయితే టీడీపీలో చేరినప్పటికీ రాజకీయాల్లో ఆక్టివ్ గా లేరు. ప్రస్తుత ఎంపీ మురళీ మోహన్ వల్ల ఆమె టీడీపీలో చేరినా అప్పటి నుంచి ఆమె టీడీపీలో క్రియాశీలంగా వ్యవహరించలేదు. తాజాగా ఆమె వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించడంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news