చంద్రబాబు మా రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నాం…

-

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఆయన గురించి చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు. ఆయన ఏపీ సీఎం అని చెప్పుకోవడానికి కూడా ఏపీ ప్రజలు సిగ్గు పడుతున్నారు. ఆయన చేసే నిర్వాకాల వల్ల ఏపీ అభివృద్ధి ఆగడమే కాదు.. ఏపీని దోచుకొని సర్వ నాశనం చేస్తున్నాడు బాబు.

Ycp leader lella appireddy fires on cm Chandrababu

తాజాగా ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు సంబంధించిన మరో వీడియో బయటికి వచ్చింది. దీనిపై స్పందించిన వైసీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి… చంద్రబాబు ఈ రాష్ట్ర సీఎం అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నామని చెప్పారు.

తెలుగు జాతికి ద్రోహం చేసిన చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం త్వరితగతిన విచారణ జరిపించి దోషులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. మనీ మీడియా, మానిపులేషన్ తో చంద్రబాబు మోసాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

చంద్రబాబు వల్ల రాజకీయాలు అంటేనే సిగ్గు పడాల్సిన పరిస్తితి వచ్చింది. చంద్రబాబుకు సిగ్గుందా.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయ్యాడు… ఇప్పుడు సొల్లు కబుర్లు మాట్లాడుతున్నాడు… చంద్రబాబు పాపం పండింది. త్వరలోనే ఆయన పని అయిపోతుంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం.. అని అప్పిరెడ్డి మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news