బాలీవుడ్​లో మరో విషాదం.. ‘ఓం శాంతి ఓం’ నటుడు మృతి

-

హిందీ బుల్లితెర సీరియల్ ‘అనుపమా’  నటుడు నితేశ్ పాండే కన్నుమూశారు. 51 ఏళ్ల వయసులో ఆయన మంగళవారం రోజున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. షూటింగ్​ కోసం నాసిక్ జిల్లా సమీపంలో గల ఇగతపురిలోని ఓ హోటల్​లో మంగళవారం నితీశ్ బస చేశారు. ఈ క్రమంలో అర్ధరాత్రి నితీశ్ తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. హోటల్ సిబ్బందితో పాటు నితేశ్​ సన్నిహితులను ప్రశ్నిస్తున్నారు. మృతికి గల కారణలతో పాటు మరిన్ని విషయాలు పోస్ట్​ మార్టం రిపోర్టులో తేలనున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలీవుడ్​కు చెందిన సినీ, టీవీ ప్రముఖులు నితేశ్ కు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

నితేశ్​ ‘ఏక్ ప్రేమ్ కహానీ’, ‘మంజిలీన్ అప్​నీ అప్​నీ’,’జస్టజూ’,’దుర్గేశ్’​, ‘నందిని’, అనుపమా వంటి సీరియల్స్​లో కీలక పాత్రలు పోషించి ఆడియన్స్​ను అలరించారు. ‘దబాంగ్​2’, ‘ఘాజీ’, ‘మేరీ యార్​ కీ షాదీ’, ‘ఓం శాంతి ఓం’ లాంటి సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన భార్య అర్పిత పాండే కూడా టీవీ నటి.

Read more RELATED
Recommended to you

Latest news