స్టార్ హీరో సినిమాను ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించిన ప్రభుత్వం..ఆనందంలో అభిమానులు

-

నూతనంగా విడుదలయ్యే కొన్ని సినిమాలకు ప్రభుత్వాలు ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించే సంగతి అందరికీ విదితమే. ఇటీవల వచ్చిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ పిక్చర్ పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించాయి. తాజాగా బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘పృథ్వీరాజ్’ సినిమాను యూపీ సర్కారు ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించింది.

ఈ చిత్రాన్ని ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు స్పెషల్ షో వేసి చూపించారు. తాజాగా ఈ సినిమాను యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ తన కేబినెట్ తో కలిసి రాజ్ భవన్ లో స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా చూశారు. అనంతరం సీఎం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

ప్రతీ ఒక్క సామాన్యుడు ఈ చిత్రం వీక్షించాలనే సదుద్దేశంతోనే ఈ డెసిషన్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు యోగి. చరిత్రను తెలిపే విధంగా సినిమా ఉందని కొనియాడారు. ‘సామ్రాట్ పృథ్వీరాజ్ ’ చిత్రం ప్రతీ ఒక్కరు చూడదగినదని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news