పూరి జగన్నధ్-మహేష్ బాబు ” జనగణమన ” కి రెడీ అవుతున్నారా .. మరి రాజమౌళి…?

-

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా పోకిరి. ఈ సినిమా 75 ఏళ్ళ ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ పూరి కలిసి బిజినెస్ మాన్ సినిమాని చేయగా పక్కా కమర్షియల్ సినిమాగా భారీ సక్సస్ ని అందుకుంది. దాంతో పూరి మహేష్ బాబు మరో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చాలా సార్లు ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమాని జనగణమన టైటిల్ తో తెరకెక్కిస్తానని పూరి చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ సినిమాని మహేష్ బాబు తో తప్ప మరెవరితో చేయనని పూరి పట్టుదలగా ఉన్నాడు. అయితే ఎందుకనో ఎన్నిసార్లు అనుకున్నా కూడా ఈ ఇద్దరి కాంబినేషన్ లో మాత్రం మూడో సినిమా కార్యరూపం దాల్చలేదు.

 

అయితే ఇస్మార్ట్ శంకర్ హిట్ కొట్టిన సమయంలో కొంతమంది పూరి ని మీరు మళ్ళీ మహేష్ బాబు తో పోకిరి లాంటి సినిమాని ఎప్పుడు తీస్తారు అని అడిగారు. వాళ్ళు అడిగిందే తడవుగా పూరి వెంటనే మహేష్ నాతో ఇప్పుడు సినిమా చేయడు ..తను సక్సస్ లో ఉన్న డైరెక్టర్స్ తో నే సినిమా చేస్తాడని ఓపెన్ గా చెప్పాడు. అప్పట్లో పూరి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.

దాంతో అందరు ఇక పూరి మహేష్ బాబు కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా ఉండదని ఫిక్సయ్యారు. కాని మహేష్ రీసెంట్ గా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. నాకు ఇష్టమైన దర్శకులలో పూరి జగన్నాధ్ ఒకరు ..తనకోసం వేయిట్ చేస్తున్నాను..ఆయన వచ్చి కథ నెరేట్ చేస్తే నేను రెడీ అంటూ ప్రేక్షకులకు ఉత్సాహాన్నిచ్చే కామెంట్స్ చేశాడు. మహేష్ బాబు ఇలా చెప్పాడో లేదో అందరూ త్వరలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా ఉంటుందని ఫిక్సైపోయారు. బహుషా పూరి విజయ్ సినిమా తర్వాత మహేష్ పరశురాం సినిమా తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news