2.ఓ ఫస్ట్ టాక్..!

-

శంకర్, రజినికాంత్ కాంబినేషన్ లో రోబో సీక్వల్ గా వచ్చిన సినిమా 2.ఓ. లైకా ప్రొడక్షన్స్ లో 600 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాలో రజినితో పాటుగా ప్రతినాయకుడిగా అక్షయ్ కుమార్ కూడా నటించడం విశేషం. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న 2.ఓ ఆల్రెడీ యూఎస్ లో ప్రీమియర్స్ పూర్తయ్యాయి. సినిమాకు అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. మరోసారి శంకర్ తన సత్తా చాటాడని అంటున్నారు.

రజిని ఇమేజ్ తగినట్టుగా కథతో పాటుగా విలన్ గా పక్షి రాజుగా అక్షయ్ కుమార్ ను సూపర్ గా వాడుకున్నాడని అంటున్నారు. ఇక సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతమని అంటున్నారు. లాస్ట్ 30 మినిట్స్ ఆడియెన్స్ కు హాలీవుడ్ సినిమా ట్రీట్ అందించాడట శంకర్. ముందునుండి అనుకున్నట్టుగానే హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో 2.ఓ తెరకెక్కింది.

ముఖ్యంగా సినిమాలో రెహమాన్ మ్యూజిక్ అద్భుతంగా ఉందని. బిజిఎం అదరగొట్టాడని తెలుస్తుంది. నిరవ్ షా సినిమాటోగ్రఫీ బాగుందట. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి 2.ఓ ఫస్ట్ టాక్ అదిరిపోయింది. సినిమా సూపర్ హిట్ అనేస్తున్నారు. మరి సినిమా అసలు టాక్ ఏంటన్నది మరికొద్దిసేపట్లో తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news