అల్లు అర్జున్ ‘పుష్ప’కు అరుదైన గౌరవం.. అంతర్జాతీయ వేదికపై హవా..

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ సినిమాకు దేశవ్యాప్తంగానే అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆదరణ లభించింది. తాజాగా ఈ పిక్చర్ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ -బన్నీ కాంబోలో వచ్చిన ఈ హ్యాట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప: ది రైజ్’ ను మాస్కో ఫిలిం ఫిస్టివల్‌లో తాజాగా ప్రదర్శించారు. బ్లాక్‌బస్టర్స్ కేటగీరీ కింద ఈ ఫిల్మ్ ను స్క్రీన్ షేర్ చేశారు. ఈ విషయాన్ని మాస్కోలోని ఇండియన్ ఎంబసీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టు ద్వారా తెలిపింది.

ఈ విషయం తెలుసుకుని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ లో సత్తా చాటిన ఈ పిక్చర్.. సీక్వెల్ పుష్ప-2 షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయింది. సుకుమార్ సీక్వెల్ ను ఫస్ట్ పార్ట్ కు మించి రచించినట్లు తెలుస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ఇందులో విలన్ పాత్ర పోషించారు.

క్యూట్ బ్యూటీ రష్మిక మందన ‘పుష్ప: ది రైజ్’లో హీరోయిన్ గా నటించింది. సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా, మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news