ఆ భారీ బ్యానర్ లో మూవీ సైన్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్…..??

-

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం జాన్ అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆయన పెద్ద నాన్న కృష్ణంరాజు కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమాని యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సక్సెస్ఫుల్ గా మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ అతి త్వరలో యూరోప్ లో జరుగనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ కొట్టి మళ్ళి ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు ప్రభాస్. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ మరొక భారీ ప్రాజక్ట్ ని నేడు ఒప్పుకుని సైన్ చేసినట్లు టాక్. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఎప్పటినుండో ప్రభాస్ డేట్స్ కోసం మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎదురుచూస్తోందని, అయితే వచ్చే ఏడాదికి తాను నటిస్తున్న జాన్ పూర్తి అయి రిలీజ్ కానుండడంతో ఈ మధ్యలోనే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమా చేసేందుకు ప్రభాస్ పచ్చ జండా ఊపినట్లు టాలీవుడ్ వర్గాల టాక్.

 

అయితే ఈ సినిమాకు ఇద్దరు దర్శకుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాగా, మరొకరు కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే ప్రశాంత్ నీల్ ఇప్పట్లో ఖాళీగా ఉండే అవకాశం లేదని, అయితే ఇటీవల అలవైకుంఠపురములో సినిమాతో మంచి  హిట్ కొట్టిన త్రివిక్రమ్, ప్రస్తుతం ఎన్టీఆర్ కోసం ఒక కథం సిద్ధం చేస్తూ, మరోవైపు ప్రభాస్ కోసం కూడా మంచి స్టోరీ రెడీ చేయనున్నట్లు చెప్తున్నారు. అయితే దీనిపై ఎక్కడా కూడా అధికారిక ప్రకటన లేనప్పటికీ ఆల్మోస్ట్ ఇది కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉందని, అలానే త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని అంటున్నారు….!!

Read more RELATED
Recommended to you

Latest news