సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేణూ దేశాయ్ పోస్ట్..!

-

రేణూ దేశాయ్ సినీ పరిశ్రమలో చేసింది తక్కువ సినిమాలే చేసిన ఆమెకు ఉన్న క్రేజీ అంత ఇంత కాదు. అయితే రేణూ దేశాయ్ ఇప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. ఇప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది. అంతేకాకుండా ఆమె నెటిజన్లతో లైవ్‌ చాట్ చేస్తుంటారు. అంతేకాకుండా అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఆమె నెగెటివ్ కామెంట్లకు తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు.

renu
renu

ఆమె అప్పట్లో రెండో పెళ్లి విషయంపై చాల కథనాలు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆమె పెళ్లి విషయంలో పవన్ కళ్యాణ్‌పై కామెంట్స్ చేయడంఎంతగా వైరల్ అయిందో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. వాటికి రేణూ దేశాయ్ చెప్పిన సమాధానాలు కూడా ఎంతగా హల్చల్ చేశాయో అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక రేణూ దేశాయ్ పుణెలో సెటిలైంది. అయితే చాలా రోజులు అక్కడే ఉంది. పిల్లలతో పుణెలోనే ఉంటున్న రేణూ ఓ ప్రాజెక్ట్ కోసం తరుచూ హైద్రాబాద్ రావాల్సి వచ్చేది. రైతు నేపథ్యంలో ఓ కథను రెడీ చేసే పనిలో హైద్రాబాద్‌ కే మకాం మార్చిన విషయం తెలిసిందే.

అయితే వెండితెరపై రేణూ దేశాయ్ కనిపించక కొన్నేళ్లు అవుతంది. ఆమె పవన్ నుంచి విడాకులు తీసుకున్నాక బుల్లితెరపై ఓ షోకు జడ్జ్‌గా వ్యవహరించారు. ఆపై ఓ కామెడీ సీరియల్‌లొ నటిస్తోంది. ఆమె సునయనతో కలిసి చేస్తోన్న ఈ ప్రోగ్రాం బాగానే క్లిక్ అయింది. తాజాగా రేణూ దేశాయ్ ఓ ఫోటోను షేర్ చేసింది. అది చూస్తే ఎవ్వరైనా సరే పరేషాన్ అవ్వాల్సిందే. చేతిలో గన్ను పట్టుకుని రేణూ దేశాయ్ అందర్నీ బెదరగొడుతోంది. వాగితే పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తా.. కానీ పిట్టల్ని మాత్రం కాల్చను అని పెట్టిన ఓ నెటిజన్ పెట్టిన కామెంట్‌కు అవును అన్నట్టుగా తెగ నవ్వేసింది రేణూ దేశాయ్.

Read more RELATED
Recommended to you

Latest news