తన పర్ఫెక్ట్ డాన్స్ పార్ట్నర్ అతనే అంటున్న సాయి పల్లవి..!

-

ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. డాన్స్ తోనే కాదు నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే ఈమె తన గ్లామర్ తోనే కాదు కళ్ళతో కూడా అభిమానులను కట్టిపడేస్తోంది. లేడీ పవర్ స్టార్ అనే బిరుదును కూడా అందుకొని అందుకు తగ్గట్టుగానే ఉన్నతమైన వ్యక్తిత్వంతో ముందుకు సాగుతోంది. చివరిగా గార్గి సినిమా తర్వాత సాయి పల్లవి మరే కొత్త ప్రాజెక్టును ఓకే చేయలేదు. ప్రస్తుతం కోలీవుడ్ లో మాత్రమే ఒక సినిమా చేస్తోంది.

సాధారణంగా చాలా రేర్ గా ఆమె ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ ఉంటుంది. అయితే తాజాగా సోనీ లీవ్ లో ప్రసారమవుతున్న నిజం విత్ స్మిత షోలో సందడి చేసింది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయగా ఎన్నో విషయాలను ఆమె మీడియాతో పంచుకుంది.. ప్రోమో నిమిషం పాటే ఉన్నా ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ముఖ్యంగా స్మిత అడిగిన రెండు ప్రశ్నలకు తనదైన శైలిలో ఔరా అనిపించేలా సమాధానాలు చెప్పింది సాయి పల్లవి. షో లో భాగంగా స్మిత సాయి పల్లవిని ఉద్దేశించి మాట్లాడుతూ.. #టాలీవుడ్ స్టార్ హీరోలు బన్నీ, తారక్ , చరణ్ లతో ఎవరితో డాన్స్ చేయాలని ఉంది.. ఎవరు నీకు పర్ఫెక్ట్ డాన్స్ పార్ట్నర్ అని అనుకుంటున్నావు” అని అడగ్గా.. “ఆ ముగ్గురు కలిసి నాతో డాన్స్ చేస్తే చాలా బాగుంటుంది.. వారే నా పర్ఫెక్ట్ డాన్స్ పార్ట్నర్స్” అంటూ నవ్వేసింది సాయి పల్లవి.

ఇది తెలియగానే అటు రామ్ చరణ్ , అల్లు అర్జున్, ఎన్టీఆర్ అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రోజంటూ ఒకటొస్తే ఖచ్చితంగా రెండు కళ్ళు చాలవు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే నిజం విత్ స్మిత ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో చాలా వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news