స‌ల్మాన్ జోరు.. అమీర్‌, షారూఖ్ బేజారు..!

-

దంగ‌ల్‌తో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న అమీర్ ఖాన్ రెండేండ్లుగా ఆక‌ట్టుకోలేక‌పోతున్నారు. చివ‌ర‌గా న‌టించిన సీక్రెట్ సూప‌ర్ స్టార్‌, థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ ఆడియెన్స్ ని ఆక‌ట్టుకోవ‌డంలో ఫెయిల్ అయ్యాయి. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నారు.

బాలీవుడ్ ఖాన్ త్ర‌యంలో స‌ల్మాన్ ఖాన్ బ్యాక్ టూ బ్యాక్ మూడు, నాలుగు సినిమాల‌ని లైన్‌లో పెట్టి దూసుకుపోతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న భార‌త్‌లో న‌టిస్తున్నారు. ఇది జూన్ 5న విడుద‌ల కానుంది. దీంతోపాటు చుల్‌బుల్ పాండే పాత్ర‌తో పాపుల‌ర్ అయిన ద‌బాంగ్ 3లో న‌టిస్తున్నారు. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ సినిమాలో సోనాక్షి సిన్హా క‌థానాయికగా, ర‌జ్జో పాత్ర‌లో మెర‌వ‌నుంది. ఇది శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

salman-gets-hits-but-aamir-and-sharukh-movies-are-big-flop-nowadays

అనంత‌రం సంజ‌య్ లీలా భ‌న్సాలీ చిత్రంలో న‌టించ‌బోతున్నారు. దీంతోపాటు 2003లో స‌తీష్ కౌశిక్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ తేరేనామ్ సీక్వెల్‌కి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలిసింది. మ‌రోవైపు ఏక్ తా టైగ‌ర్ రెండో సీక్వెల్‌లోనూ న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. 2012లో విడుద‌లైన ఈ సినిమాకి అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 2017లో దీనికి సీక్వెల్‌గా టైగ‌ర్ జిందా హై వ‌చ్చి బాక్సాఫీసు వ‌ద్ద సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు రెండో సీక్వెల్‌కి ప్లాన్ జ‌రుగుతుందని చిత్ర ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ జాఫ‌ర్ తెలిపారు.

ఇదిలా ఉంటే దంగ‌ల్‌తో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న అమీర్ ఖాన్ రెండేండ్లుగా ఆక‌ట్టుకోలేక‌పోతున్నారు. చివ‌ర‌గా న‌టించిన సీక్రెట్ సూప‌ర్ స్టార్‌, థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ ఆడియెన్స్ ని ఆక‌ట్టుకోవ‌డంలో ఫెయిల్ అయ్యాయి. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయ‌న హాలీవుడ్ సూప‌ర్ హిట్ ఫారెస్ట్ గంప్ చిత్ర రీమేక్‌లో న‌టిస్తార‌నే వార్త‌లొచ్చాయి. దీన్నీ లాల్‌సింగ్ చ‌ద్దా పేరుతో రీమేక్ చేస్తార‌ని, అక్టోబ‌ర్‌లో సినిమాని ప్రారంభించి, క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. అయితే దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.

అమీర్ బాట‌లోనే షారూఖ్ ఉన్నారు. దిల్‌వాలే నుంచి ఆయ‌న‌కు ఒక్క హిట్ కూడా లేదు. ఫ్యాన్‌, ఏ దిల్ హై ముష్కిల్‌, డియ‌ర్ జింద‌గీ, రాయూస్‌, జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్, జీరో చిత్రాలు ప‌ర‌జ‌యం చెందాయి. డియ‌ర్ జింద‌గీ ఫ‌ర్వాలేద‌నిపించుకుంది. దీంతో షారూఖ్ కూడా పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. గెస్ట్ పాత్ర‌ల‌కే త‌ప్ప ఆయ‌న త‌దుప‌రి సినిమాకి ఇంకా సైన్ చేయ‌లేద‌ట‌. ప్ర‌స్తుతం ఆయ‌న త‌మిళంలో విజ‌య్ హీరోగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమాలో విల‌న్ పాత్ర‌లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు టాక్‌.

మ‌రోవైపు కంగ‌నా ర‌నౌత్, రాజ్ కుమార్ రావ్ జంట‌గా న‌టించిన బాలీవుడ్ చిత్రం మెంట‌ల్ హై క్యాలో కంగ‌నాకి తండ్రిగా గెస్ట్ రోల్ చేసేందుకు ఓకే చెప్పారు. కానీ ఇంత వ‌ర‌కు త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించ‌లేదు. వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత షారూఖ్ ఎలాంటి సినిమా చేస్తార‌నే వ‌స్తార‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో నెక్ట్స్ సినిమా ఉంటుంద‌నే టాక్ బాలీవుడ్‌లో ర‌న్ అవుతుంది. మొత్తంగా స‌ల్మాన్ వ‌రుస‌గా మూడు,నాలుగు ప్రాజెక్ట్ ల‌తో ఫుల్ జోరులో ఉంటే.. అమీర్‌, షారూఖ్ మాత్రం నెక్ట్స్ ఏ సినిమా చేయాల‌నే బేజారులో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news