పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకొని… గంటకే విడిపోయారు..!

-

పెళ్లి కాగానే కొత్త పెళ్లి జంట… రోజా ఇంటికి వెళ్లారు. వాళ్లను చూసి కోపం తట్టుకోలేక.. రోజా కుటుంబ సభ్యులు.. వాళ్లను వాళ్ల ఆఫీసుకు తీసుకెళ్లారు. బాలాజీ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు.

ప్రేమ వివాహం చేసుకోవాలంటే మామూలు విషయం కాదు. పెద్దల్ని ఎదిరించాలి.. ధైర్యం చేయాలి. దానికి ఎంతో తెగువ ఉండాలి. ఓ జంట కూడా ఇలాగే పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. కాకపోతే.. పెళ్లయిన గంటకే ఆ జంట విడిపోయింది.

love couple separated within hour after their marriage in tamilnadu

ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకున్నది. చెన్నైకి చెందిన బాలాజీ… ప్రభుత్వ ఉద్యోగి. వేలూరు జిల్లా గుడియాత్తం మున్సిపల్ కమిషనర్. అదే ఆఫీసులో పని చేసే రోజా అనే యువతిని బాలాజీ ప్రేమించాడు. తన ప్రేమను రోజా కూడా ఒప్పుకుంది. కొన్ని రోజులు ప్రేమించుకున్న తర్వాత.. పెళ్లి చేసుకుందామని.. పెద్దల్ని ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ.. ఇరు కుటుంబాల వాళ్లు వాళ్ల పెళ్లికి ససేమిరా అన్నారు.

దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న బాలాజీ, రోజాల మధ్య పెళ్లి గొడవే. ఓరోజు ఇలాగే ఆఫీసులో పెళ్లి విషయమై ఇద్దరూ గొడవ పెట్టుకున్నారు. దీంతో ఆవేశంలో రోజా బ్లేడుతో తన చేతిని కోసుకుంది. ఇలా కాదని.. బాలాజీ.. వెంటనే ఆమెను గుడికి తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు.

అయితే.. వీళ్ల పెళ్లి గురించి తెలుసుకున్న ఇరు కుటుంబాలు.. తమ కొడుకును కిడ్నాప్ చేశారంటూ రోజా తరుపు కుటుంబ సభ్యులపై… తమ కూతురును కిడ్నాప్ చేశారంటూ బాలాజీ కుటుంబ సభ్యులపై కేసు పెట్టారు.

పెళ్లి కాగానే కొత్త పెళ్లి జంట… రోజా ఇంటికి వెళ్లారు. వాళ్లను చూసి కోపం తట్టుకోలేక.. రోజా కుటుంబ సభ్యులు.. వాళ్లను వాళ్ల ఆఫీసుకు తీసుకెళ్లారు. బాలాజీ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ తీవ్రతరం కావడంతో… బాలాజీ కుటుంబ సభ్యులు బాలాజీని, రోజా కుటుంబ సభ్యులు రోజాను తీసుకెళ్లిపోయారు. దీంతో పెళ్లయిన గంటకే ఆ జంట విడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఇరు కుటుంబాలను పిలిచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరినప్పటికీ.. వాళ్లు అస్సలు వినలేదట. దీంతో వాళ్లు మళ్లీ కలవడం డౌటే అని అక్కడి స్థానికులు అనుకున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news