ఆమెను చూస్తే అసూయ కలుగుతోంది అంటున్న సీనియర్ నటి మీనా..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న మీనా ఇటీవల ఐశ్వర్యరాయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది . సోషల్ మీడియా వేదికగా పొన్నియన్ సెల్వన్ సినిమాపై స్పందించిన ఆమె ఐశ్వర్యాను చూస్తుంటే జీవితంలో మొదటిసారి అసూయ కలుగుతుంది అంటూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇకపోతే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో నాలుగు సంవత్సరాల తర్వాత వెండితెరపై దర్శనమిచ్చిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఏకంగా రెండు పవర్ఫుల్ పాత్రలతో అభిమానులకు డబుల్ కిక్ ఇచ్చింది. ఇక ఇలా ఇందులో విక్రమ్, జయం రవి , ఐశ్వర్యరాయ్, ఐశ్వర్య లక్ష్మి, కార్తీక్ , త్రిష, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. ఇకపోతే ఈ సినిమాకి ఐశ్వర్యరాయ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక అందుకు తగ్గట్లే సినిమా విడుదలయ్యాక నాలుగుపదుల ఐశ్వర్య అందం.. అంతకుమించిన అభినయంపై ప్రశంసలు వెలబడుతున్నాయి.

ఇక ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పొన్నియన్ సెల్వన్ సినిమాపై స్పందించిన మీనా ఐశ్వర్యా ను చూస్తుంటే అసూయ కలుగుతుంది అంటూ కామెంట్లు చేసింది. ఇక మొదటిసారి తన డ్రీమ్ క్యారెక్టర్ నందిని పాత్రను కొట్టేసిన ఐశ్వర్య ను చూస్తుంటే అసూయ కలిగింది . నా జీవితంలో ఒకరిని చూసి అసూయ పడడం ఇదే తొలిసారి. ఇక పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించిన నటీనటులందరికీ అభినందనలు.. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా నటించారు అని చెబుతూనే ఈ సినిమాలోని ఐశ్వర్య స్టిల్స్ ను మీనా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీన విడుదలవగా మొదటి రోజే రూ.39 కోట్లు రాబట్టింది . కేవలం తమిళనాడులోని ఏకంగా రూ. 23.5 కోట్లు రాబట్టినట్లు సమాచారం . ఇక తెలుగులో రూ.5.50 కోట్లు, కర్ణాటకలో రూ.4కోట్లు , కేరళలో రూ.3.25 కోట్లతో పాటు నార్త్ ఇండియాలో రూ.2.75 కోట్లు రాబడినట్లు సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Meena Sagar (@meenasagar16)

Read more RELATED
Recommended to you

Latest news