ప్రభాస్ సినిమా ఆమె వల్లే లేట్

-

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. రన్ రాజా రన్ డైరక్టర్ సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుంది. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్నా హీరోయిన్ వల్ల ఇంకా బాగా లేటవుతుందని అంటున్నారు.

అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ చేయాల్సి ఉన్నా సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్ డెంగ్యూ భారీన పడటం వల్ల సినిమా షూటింగ్ కు అటెండ్ అవట్లేదట. ఆమె పూర్తిగా కోలుకున్నాకే షూటింగ్ మొదలు పెడతారట. అయితే ప్రభాస్, శ్రద్ధ కాంబినేషన్ లో కొన్ని సీన్స్ షూట్ చేయాల్సి ఉంది. అవి పూర్తయ్యాక మరికొన్ని యాక్షన్ సీన్స్ చేస్తారట. 2019 సమ్మర్ టార్గెట్ తో రాబోతున్న సాహో సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news