శరత్ బాబు మృతి సినీరంగానికి తీరని లోటు – చంద్రబాబు

-

ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమను కన్నీటి సాగరంలో ముంచి వెళ్లిపోయారు. దాదాపు రెండు మాసాలుగా అనారోగ్యంతో బెంగుళూరు, ఆ తర్వాత హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్న శరత్ బాబు మృత్యువుతో పోరాడి చివరకు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో మృతి చెందారు. శరత్ బాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు శరత్ బాబు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ” వివిధ భాషా చిత్రాల్లో హీరోగా, వీలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి.. దక్షిణాది సినీ ప్రేక్షకులను మెప్పించిన శరత్ బాబు గారి మృతి సినీ రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మ శాంతికై ప్రార్ధిస్తూ, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను” అని ట్విట్ చేశారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news