సుకుమార్ రీమేక్ చేయాలనుకున్న చిత్రాలివే..

-

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ‘పుష్ప’ ఫిల్మ్ తో పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నారు. దేశవ్యాప్తంగా పలు ఇండస్ట్రీలకు చెందిన నటీ నటులు సుకుమార్ తో వర్క్ చేయాలనుకుంటున్నారు. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తన తో ఒక సినిమా చేయాలని సుకుమార్ ను రిక్వెస్ట్ చేశారు కూడా. కాగా, సుకుమార్ ఈ చిత్రాలను రీమేక్ చేయాలనుకున్నారు. ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

‘పుష్ప’ సినిమాకు సీక్వెల్ ‘పుష్ప-2’ షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయింది. త్వరలో షూటింగ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొననున్నారు. ఈ సంగతులు అలా పక్కనబెడితే.. సుకుమార్.. సూపర్ హిట్ ఫిల్మ్స్ రెండిటినీ రీమేక్ చేయాలనుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

తనకు థ్రిల్లర్ జోనర్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టమని పేర్కొన్న సుకుమార్… ఆ కేటగిరీలో వచ్చి సక్సెస్ అయిన ‘రాచసన్’ రీమేక్ చేయాలనిపించిందని చెప్పారు. ‘రాచసన్’లో విష్ణు విశాల్, అమలా పాల్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇక యాక్షన్ డ్రామా ‘విక్రమ్ వేద’ కూడా తనకు బాగా నచ్చిందని సుకుమార్ చెప్పారు.

ఆర్.మాధవన్-విజయ్ సేతుపతి నటించిన ‘విక్రమ్ వేద’ వచ్చిన టైమ్ లో తాను ఖాళీగా ఉన్నానని, ఎవరైనా వచ్చిన రీమేక్ చేయాలని అడిగితే చేసేవాడినని సుకుమార్ పేర్కొన్నారు. ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేశారు. త్వరలో విడుదల కానుంది. ఒరిజినల్ ను డైరెక్టర్ చేసిన దర్శక ద్వయమే హిందీలోనూ డైరెక్ట్ చేశారు. హృతిక్ రోషన్- సైఫ్ అలీ ఖాన్ ఇందులో నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news