అవన్నీ ఒట్టి పుకార్లేనట…..!!

-

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంస్థలు ఎంతో భారీగా మరియు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం యూరోప్ బ్యాక్ డ్రాప్ లో జరిగిన రెట్రో ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఈ సినిమాకు జాన్ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రభాస్ హీరోగా రిలీజ్ అయిన సాహో సినిమా బాక్సాఫీస్ దగ్గర అపజయాన్ని అందుకోవడంతో, తప్పకుండా జాన్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రభాస్ ఎంతో కసిగా పనిచేస్తున్నట్లు టాక్. సాహోలో మిస్ అయిన కామెడీ, కమర్షియల్ అంశాల వంటివి దీనిలో పుష్కలంగా ఉండేలా చూసుకుంటున్నారట. ఇకపోతే ఈ సినిమా జరుగుతుండగానే, అతి త్వరలో ప్రభాస్, అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారని కొద్దిరోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి.

ఇటీవల తన తదుపరి సినిమా పేరు డెవిల్ అని ప్రకటించిన సందీప్, ఆ సినిమాలో ఒక స్టార్ హీరో నటించబోతున్నారని అన్నారు. అయితే ఆ సినిమాలో నటించబోయేది ప్రభాస్ అని, ఆ సినిమా కథ నచ్చడంతోనే ప్రభాస్ పచ్చ జండా ఊపారని వార్తలు వచ్చాయి. ఇక నేడు ఈ విషయమై ప్రభాస్ సన్నిహితుల నుండి బయటకు వచ్చిన న్యూస్ ని బట్టి, ప్రస్తుతం జాన్ షూటింగ్ లో పూర్తిగా బిజీగా ఉన్న ప్రభాస్, తన తదుపరి సినిమాను ఇంకా ఓకే చేయలేదని, కావున సందీప్ రెడ్డి వంగ సినిమా విషయమై ప్రచారం అవుతున్నవన్నీ కూడా ఒట్టి పుకార్లేనని తేల్చేశారట. కాగా ఈ ఏడాది ద్వితీయార్ధంలో జాన్ విడుదల కానుంది…..!!

Read more RELATED
Recommended to you

Latest news