అంచనాలు తలకిందులు..దారుణమైన ఫ్లాప్ సినిమాలు తీసిన స్టార్ డైరెక్టర్స్..ఎవరెవరంటే?

-

జనరల్ గా స్టార్ డైరెక్టర్స్ తీసే సినిమాలపైన అంచనాలు ఉంటాయి. ఒకవేళ వారు స్టార్ హీరోతో కాంబినేషన్ కుదుర్చుకుని వారు ఫిల్మ్ తీస్తున్నట్లయితే అంచనాలు ఇంకా భారీ స్థాయిలో ఉంటాయి. అలా ఒక రకంగా దర్శకుడు, హీరో ఇద్దరికీ ప్రెషర్ ఉంటుంది. కాబట్టి వారు చాలా జాగ్రత్తలు తీసుకుని, సినిమా స్టోరి, కథనం, స్క్రీన్ ప్లేపైన ఫుల్ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. లేదంటే అంచనాలు తలకిందులై సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అలా దారుణమైన ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ గురించి తెలుసుకుందాం.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా విడుదలై అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపైన బోలెడన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉండగా, అవన్నీ తలకిందులయ్యాయి. తండ్రీ తనయులు మెగాస్టార్ చిరు, మెగా పవర్ స్టార్ చరణ్..కలిసి నటించిన ఈ చిత్రం చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అయింది. ఈ పిక్చర్ తో కొరటాల శివ తొలిసారి అపజయం తన ఖాతాలో వేసుకున్నారు.

మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను..యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన చిత్రం ‘దమ్ము’..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ ఫిల్మ్ డిజాస్టర్ గా నిలిచింది. బాబాయ్ బాలయ్యకు వరుస హిట్ మూవీస్ ఇచ్చిన బోయపాటి..అబ్బాయి తారక్ కు ఫ్లాప్ ఇచ్చాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బోయపాటి తీసిన ‘వినయ విధేయ రామ’ ఫిల్మ్ కూడా డిజాస్టర్ గానే నిలిచింది.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడుగా పేరు గాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కల్యాణ్ కాంబినేషన్ పైన అభిమానులు, సినీ లవర్స్ కు భారీ అంచనాలుంటాయి. ఆ అంచనాలు అందుకునేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, వీరి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ గా నిలిచింది.

ఫ్యామిలీ ఎమోషన్స్ ప్లస్ క్లాసికల్ టచ్ ఇస్తూ చక్కటి కుటుంబ నేపథ్యమున్న చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ను శ్రీకాంత్ అడ్డాల అందించారు. మహేశ్ బాబు-వెంకటేశ్ ఇందులో నటించగా, తర్వాత మహేశ్ -శ్రీకాంత్ అడ్డాల కాంబోలో వచ్చిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ పిక్చర్ మహేశ్ కెరీర్ లోనే దారుణమైన ఫ్లాప్ గా నిలిచింది.

స్టైలిష్ డైరెక్టర్ గా తనకంటూ ఇక ఇమేజ్ ను డైరెక్టర్ మెహర్ రమేశ్ ‘బిల్లా’ చిత్రంతో ఏర్పరుచుకున్నారు. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ పిక్చర్ సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో మెహర్ రమేశ్ తన నెక్స్ట్ ఫిల్మ్ ను తారక్ తో చేశారు. అమ్మవారు, రక్షకుడు అనే స్టోరి లైన్ తో వచ్చిన ‘శక్తి’ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.

 

Read more RELATED
Recommended to you

Latest news