నిజం చెప్పే ధైర్యం బాలకృష్ణకు లేదు..!

-

నందమూరి బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా ఆర్జివి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అంటూ ఓ సినిమా మొదలు పెట్టిన విషయం తెలిసిందే. సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. రీసెంట్ గా ట్రైలర్ తో వర్మ ఏం చెప్పదలచుకున్నాడో దాన్ని పర్ఫెక్ట్ గా చెప్పేశాడని అనిపిస్తుంది.

ఇక ఎన్.టి.ఆర్ మహానాయకుడు, లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ పోటీలో ఎవరు నెగ్గుతారు అన్న విషయం మీద చర్చలు మొదలయ్యాయి. ఇదిలాఉంటే ఎన్.టి.ఆర్ బయోపిక్ లో నిజాలు చెప్పే ధైర్యం బాలకృష్ణ లేదని అంటున్నాడు టాలీవుడ్ కమెడియన్ థర్టీ ఇయర్స్ పృధ్వి. ఆయన వైసిపికి సపోర్ట్ ఇస్తూ పలు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. వర్మ ఎన్.టి.ఆర్ అసలు కథను చెబుతున్నారని.. అందుకే ఆయన సినిమాకు అంత మంచి రెస్పాన్స్ వస్తుందని అన్నారు పృధ్వి. బాలకృష్ణ కేవలం ఎన్.టి.ఆర్ గొప్పతనాన్ని మాత్రమే చూపిస్తున్నారని.. ఆయనకు చంద్రబాబు గురించి నెగటివ్ గా చూపించే ధైర్యం లేదని ఎందుకంటే ఆయన చంద్రాబాబు వియంకుడు కావడమే కారణమని అంటున్నాడు పృధ్వి.

Read more RELATED
Recommended to you

Latest news