కెరీర్ విషయంలో కీర్తి చేసిన అతి పెద్ద తప్పు ఇదే..!!

-

మహానటి కీర్తి సురేష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందంతో, నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేక పోతోంది. ఇక తాజాగా మహేష్ బాబుతో పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె ఊహించని స్థాయిలో విజయం అందుకున్నప్పటికీ.. స్టార్ హీరోల సినిమాలలో మాత్రం అవకాశాలు ఎక్కడా లభించడం లేదని తెలుస్తోంది. మొదటిసారి కీర్తి సురేష్ ఇలా గ్లామరస్ గా కనిపించడం గమనార్హం. ఇకపోతే స్టార్ హీరోలు ఈమెతో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లతో పోల్చుకుంటే కీర్తి సురేష్ తన కెరీర్ విషయంలో కాస్త వెనక పడ్డారు అని చెప్పడంలో సందేహం లేదు.Keerthi Suresh Moves To Another Date, But.. - Movie News

ఇకపోతే నాగ వంశీ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమా తర్వాత ఈమె చేసిన పొరపాట్లే తనను ఈ స్థాయికి చేర్చాయి అని పలువురు అభిమానులు చెబుతున్నారు. ఇకపోతే మహానటి తర్వాత అన్ని లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టులకు కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే అందులో కూడా ఆ సినిమాలో మెజారిటీ స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఇక ఈ సినిమాలే కీర్తి సురేష్ కెరియర్ కు బాగా నష్టాన్ని అందించాయి.. నిజానికి కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించకుండా స్టార్ హీరోల చిత్రాలలో నటించి ఉండి ఉంటే కచ్చితంగా ఈమె కెరియర్ కు ప్లస్ అయి ఉండేది అని ప్రతి ఒక్కరి వాదన.

అంతేకాదు ఈమె హీరోల సినిమాలలో అవకాశాలు వచ్చినప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే కచ్చితంగా తన కెరియర్ స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉండేది అని అందరూ అభిప్రాయ పడుతున్నారు. ఇక కీర్తి సురేష్ భవిష్యత్తులోనైనా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేయకుండా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటే ఈమె కెరియర్ మరింత ఊపందుకుంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ప్రస్తుతం దసరా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news