ఆ టాలీవుడ్ హీరోలు తనని కమిట్మెంట్ అడిగారంటున్న హీరోయిన్..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి నటుడు సునీల్ తో కలిసి భీమవరం బుల్లోడు సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఎస్తేర్. గడిచిన కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అసలు ఎస్తేర్ ఏమి చెప్పింది… ఎందుకు ఆమె కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి అనే విషయం తెలుసుకోవాలి అంటే కచ్చితంగా ఇది చదవాల్సిందే.

ఎస్తేర్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఆఫర్లు కావాలంటే ఇద్దరు హీరోలు తనని కమిట్మెంట్ అడిగారని తెలియజేస్తుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే ఇక నీ కెరియర్ ముగుస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చారట. ఇక సినిమా అంటే కేవలం తనకు చాలా ఇష్టమని ఇదే జీవితం కాదు కదా అందుకోసం ఇంత దిగజారి పోవడం తనకు నచ్చలేదని తెలియజేసింది ఎస్తేర్. ఇక ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో కూడా పలు అవకాశాలు బాగానే వస్తున్నాయని తెలియజేస్తోంది. ప్రస్తుతం ఇప్పటివరకు తెలుగులో కేవలం నాలుగు ఐదు చిత్రాలు మాత్రమే నటించానని. కన్నడలో కొన్ని సినిమాలలో నటించాను అయితే నన్ను కమిట్మెంట్ అడగడం తనకు నచ్చలేదని తెలియజేస్తుంది.

కానీ తెలుగు ఇండస్ట్రీలో బోల్డ్ గా ఉండని అమ్మాయిలకు అసలు అవకాశాలే రావని తెలియజేస్తోంది ఎస్తేరు. మరి పద్ధతిగా ఉన్న అమ్మాయిలు హీరోయిన్లుగా ఎందుకు రాణించలేకపోతున్నారు అంటే ఇటీవల తనకు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి తెలియజేసింది. కేవలం కొంతమంది హీరోలు కమిట్మెంట్ ఇవ్వకపోతే కచ్చితంగా వారి సినిమాలలో తీసుకోరని తెలియజేసింది. అంతేకాకుండా ఏదైనా బోల్డ్ సన్నివేశాలలో నటిస్తే.. ఇక తర్వాత వచ్చే సినిమాలు అన్నీ కూడా అలాంటివే వస్తాయని తెలియజేస్తోంది ఎస్తేర్. అందుచేతనే చాలామంది హీరోయిన్లకు అవకాశాలు రాలేదని తెలియజేస్తోంది. ఏది ఏమైనా ఎస్తేర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం చాలా హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news