ప్రభాస్ ఓ భూకబ్జాదారుడు..!

-

టాలీవుడ్ లో ఎలాంటి నెగటివ్ విమర్శలకు తావివ్వని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన గెస్ట్ హౌజ్ విషయంలో మాత్రం అపవాదాలు మోస్తున్నాడు. శేరిలింగంపల్లి రెవిన్యూ పరిధిలో గల ప్రభుత్వ భూమిలో ప్రభాస్ గెస్ట్ హౌజ్ నిర్మించుకున్నాడు. అయితే అది గవర్నమెంట్ భూమి అని సుప్రీం కోర్ట్ తీర్పు ఇవ్వడంతో ఈమధ్యనే ప్రభాస్ గెస్ట్ హౌజ్ సీజ్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విషయంపై ప్రభాస్ హై కోర్ట్ లో పిటీషన్ వేశాడు.

అయితే ప్రభుత్వ తరపున న్యాయవాది ప్రభాస్ ఓ భూ కబ్జాదారుడు ప్రభుత్వ స్థలం ఎవరు కాజేయాలని చూసినా విడిచిపెట్టేది లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ప్రభాస్ దాన్ని ప్రభుత్వ స్థలమని తెలిసి కొనలేదు. ఎవరో మీడియేటర్ ద్వారా ఆ స్థలం కొన్నాడు. ఇప్పుడు అది ప్రభుత్వ స్థలమని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఇన్నాళ్లు వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్న ప్రభాస్ గెస్ట్ హౌజ్ విషయంలో షాక్ తిన్నాడు. గురువారం జరిగిన ఇరు వర్గాల చర్చల్లో తీర్పుని మాత్రం హోల్డ్ లో ఉంచారు.

Read more RELATED
Recommended to you

Latest news