రాజమౌళికి షాక్ ఇస్తున్న ఆ ఇద్దరు..!

-

బాహుబలి తర్వార రాజమౌళి చేస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమా ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మాణంలో 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. చరణ్ కు సంబందించిన కొన్ని ఫైట్ సీన్స్ షూట్ చేస్తున్నారట. అయితే ఓ పక్క సినిమా షూటింగ్ మొదలు పెట్టినా సరే ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

బాలీవుడ్ భామలు పరిణితి చోప్రా, అలియా భట్ లను హీరోయిన్స్ గా మాట్లాడుతున్నారని తెలిసినా వారు భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారట. బాహుబలి తర్వాత రాజమౌళి సినిమాలో ఛాన్స్ వచ్చినా సరే రెమ్యునరేషన్ గురించి ఆలోచించడం ఎంతవరకు కరెక్టో వారికే తెలియాలి. ప్రస్తుతం అక్కడ ఫాం లో ఉన్న అలియా భట్ 6 కోట్లు అడుగుతుండగా.. పరిణితి మాత్రం 4 కోట్లు ఇస్తే ఓకే అంటుందట.

మన దగ్గర హీరోలకు 20 కోట్లు ఆపైన ఉంటుంది తప్ప హీరోయిన్స్ కు అంత ఉండదు. ఇస్తే కోటి మహా అయితే 2 కోట్లు అంతే అంతకుమించి ఉండదు. మరి బాలీవుడ్ భామలు అడిగే పారితోషికం ఇచ్చి వారిని తీసుకుంటారా లేక ఇక్కడ హీరోయిన్స్ తోనే సరిపెడతారా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news