Unstoppable: నెక్స్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చేది వాళ్ళిద్దరేనా..!!

-

నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో మొదటి సీజన్ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా రెండవ సీజన్ ను ప్రారంభించడం జరిగింది. ఇందులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, అతని కుమారుడు లోకేష్ మొదటి ఎపిసోడ్లో గెస్ట్ గా వచ్చి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. అంతేకాకుండా అన్ స్టాపబుల్ షో లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, బాలయ్య రెస్పాన్స్ పొలిటికల్ హీట్ ను మళ్లీ తెరలేపాయని చెప్పవచ్చు. ఇక బాలకృష్ణ బావ అల్లుడితో కలిసి వినోదాన్ని పంచడం నందమూరి అభిమానులను బాగా ఆకట్టుతుంది.

ఇక మొదటి ఎపిసోడ్ మంచి విజయం కావడంతో ఇప్పుడు అందరీ దృష్టి రెండవ ఎపిసోడ్ పైన పడింది. ఈసారి బాలయ్య షో కి ఎవరు గెస్ట్ గా వస్తారనే విషయం తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలోని ఆహా యాజమాన్యం తన ట్విట్టర్ నుంచి ఒక ఆసక్తికరమైన పోస్ట్ ను సైతం షేర్ చేయడం జరిగింది. గెస్ ది గెస్ట్ ఆఫ్ ఎపిసోడ్-2 అంటూ తన తర్వాత ఎపిసోడ్ కు సంబంధించి నెక్స్ట్ ఎవరు గెస్ చేయమంటూ ప్రేక్షకులకు ఒక పజిల్ ని సవాలుగా విసిరారు.

అయితే మొదటి ఫజిల్ ను చూస్తే డిజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి షో కి రాబోతున్నట్లుగా అర్థమవుతోంది. ఇక ఈ విషయాన్ని కూడా ప్రేక్షకుల సైతం కామెంట్లలో తెలియజేస్తున్నారు. అయితే రెండవ పజిల్ మాత్రం కాస్త కష్టంగా ఉన్నప్పటికీ అశోక వనంలో అర్జున కల్యాణం చిత్రంతో ఆకట్టుకున్న విశ్వక్ సేన్ రాబోతున్నారని కొందరు అంటూ ఉండగా మరి కొంతమంది సిద్దు జొన్నలగడ్డ అని చెబుతున్నారు. మరి ఎవరు అతిథిగా వస్తారనే విషయం పై ప్రోమో విడుదలయితే కానీ చెప్పలేము.

Read more RELATED
Recommended to you

Latest news