విశాఖను ఇండియాకు రెండో రాజధాని చేయాలని గర్జించండి రా – నాగబాబు

-

విశాఖ ఎయిర్‌పోర్ట్‌ దగ్గర నిన్న రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మంత్రులు రోజా, జోగి రమేష్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడి జరిగింది. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న సమయంలో మంత్రుల కార్లపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు జనసేన కార్యకర్తలు. అయితే.. ఈ సంఘటనపై జనసేన కీలక నేత నాగబాబు స్పందించారు.

వైజాగ్‌ను మీరు రాజధాని చెయ్యటం ఏంట్రా బాబు. వైజాగ్‌ ఇప్పటికే రాజధాని అమ్మమొగుడు లాంటి సిటీ అంటూ ట్వీట్‌ చేశారు. వీలైతే ఇండియాకి రెండవ రాజధాని చెయ్యమని గర్జించండని వైసీపీ నేతలకు చురకలు అంటించారు నాగబాబు. మంత్రులు రోజా, జోగి రమేష్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడి అనేది అవాస్తవమన్నారు. పగలు వర్షం చుక్కలు , రాత్రి ఆకాశం లో చుక్కలు.ఏదేమైనా అందరికి ప్రకృతి చుక్కలు చూపిస్తుందని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news