ప్రమాదంలో రష్మిక.. అసలు ఏం జరిగిందంటే..?

-

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాను ఇటీవల ప్రమాదం బారిన పడ్డానని.. అయితే చిన్న ప్రమాదమేనని తెలిపారు. డాక్టర్ల సలహా మేరకు ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నానని.. కోలుకుంటున్నట్టు వెల్లడించారు. సోషల్ మీడియాలో నేను యాక్టివ్ గా ఉండి, పబ్లిక్ లో కనిపించి చాలా రోజులు అయింది అని తెలిపింది.

చిన్న ప్రమాదం జరగడంతోనే ఆగస్టులో చురుకుగా ఉండలేకపోయాను. ఇప్పుడు యాక్టివ్ గానే ఉన్నాను. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి ఎప్పుడూ అధిక ప్రాధాన్యత ఇవ్వండి. జీవితం చిన్నది, రేపు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ప్రతీ క్షణాన్ని ఆస్వాదించండి అని అభిమానులకు సూచించారు. రష్మిక ప్రస్తుతం పుష్ప 2, సికిందర్, ఛావా సినిమాల్లో నటిస్తోంది. వ్యాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్ కూడా నటించే అవకాశముంది. ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో, కుబేర్ వంటి మరో మూడు సినిమాల పేర్లు చర్చలో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version