ఏంటీ.. చైతూ కోసమే సమంత విడాకులు తీసుకుందా.. తెరపైకి నిజాలు..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్న సమంత నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా పరిచయం అయిన వీరు ఆ తర్వాత ప్రేమించుకుని కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కానీ ఏమైందో తెలియదు నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితంలో సంతోషంగా గడిపిన ఈ జంట ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఇకపోతే వీరు మళ్లీ కలవాలని ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ సాధ్యపడలేదు.

మరికొంతమంది సమంతాను నిందిస్తూ సమంత వేరొకరితో ఎఫైర్ పెట్టుకుని పిల్లలను కనడం ఇష్టం లేదు అందుకే విడాకులు తీసుకుంది అంటూ రకరకాలుగా పుకార్లు షికార్లు చేశారు. అయితే వీటిపై స్పందించిన సమంత వెంటనే కోర్టును ఆశ్రయించగా కోర్టు కూడా సోషల్ మీడియాకు ఆదేశాలు జారీ చేస్తూ సమంత పై బ్యాడ్గా రాయకూడదు అని కూడా వెల్లడించింది. అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ తెరపైకి సరికొత్త నిజాలు బయటకు వచ్చాయి.

సమంతకు మయో సిటీస్ అనే భయంకరమైన వ్యాధి ఉందని తనకు ముందే తెలుసు అని అయితే ఆ తర్వాత కూడా తరచూ అనారోగ్య సమస్యలు వస్తుండడంతో నాగచైతన్యను, అటు అక్కినేని ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకూడదు అన్న ఆలోచనతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకుందట. ఇక నాగచైతన్య భవిష్యత్తు బాగుండాలి అని అక్కినేని కుటుంబానికి వారసుడిని ఇచ్చే అమ్మాయిని ఆయన మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఆకాంక్షతోనే నాగచైతన్యకు సమంత విడాకులు ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news