రికార్డులు తిరగరాసిన మోహన్ బాబు ‘పెదరాయుడు’ సినిమా వద్దనుకున్న జయసుధ.. కారణమిదే..!!

-

సూపర్ స్టార్ రజనీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన ‘పెదరాయుడు’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటికి ఉన్న ఇండస్ట్రీ రికార్డులు అన్నిటినీ ఈ ఫిల్మ్ తిరగ రాసింది. ఇందులో మెహన్ బాబు ద్విపాత్రాభినయం చేశారు. హీరోయిన్స్ గా భానుప్రియ, సౌందర్య నటించారు. కాగా, హిట్ పెయిర్ గా అప్పటికే పేరున్న జయసుధ ఈ చిత్రం వద్దనుకుందట. అందుకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

సహజ నటి జయసుధ, మోహన్ బాబులది హిట్ కాంబినేషన్. అప్పటికే వీరిరువురు కలిసి నటించిన చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.

‘కల్యాణ తిలకం’, ‘రాయలసీమ రామన్న చౌదరి’, ‘ఏడు అడుగుల బంధం’, ‘శివ రంజిని’లతో వీరు జంటగా ఆన్ స్క్రీన్ పైన చక్కగా కనిపించారు. ఈ నేపథ్యంలో ‘పెదరాయుడు’ చిత్ర షూటింగ్ కు ముందర స్టోరి జయసుధకు వినిపించారట.

స్టోరిలో భాగంగా ఇందులో మోహన్ బాబుకు డ్యూయెట్ ఉండటం జయసుధకు నచ్చలేదట. తాను ఈ మూవీ చేయనని చెప్పిందట. అలా ఈ పిక్చర్ భానుప్రియ వద్దకు వచ్చింది. ఈ సినిమా తర్వాత మోహన్ బాబు క్రేజ్ అమాంతంగా పెరిగింది. రికార్డు వసూళ్లు చేసిన ఈ సినిమా తమిళ్ రీమేక్.

peda rayudu mohan babu movie
peda rayudu mohan babu movie

‘నాట్టమై’ అనే పిక్చర్ తమిళ్ రైట్స్ తీసుకున్న రజనీకాంత్..ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా ‘పెదరాయుడు’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సినిమా ఓపెనింగ్ కు సీనియర్ ఎన్టీఆర్ రావడం విశేషం. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కోటీ మ్యూజిక్ అందించారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు ప్రొడ్యూస్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news