ఈ నియమాలను రోజూ పాటిస్తే.. డబ్బుకు డోకా ఉండదు.. డబ్బే డబ్బు..

-

జనాలు ఎక్కువగా వాస్తును ఫాలో అవుతున్నారు.. వాస్తు ప్రకారం అన్ని చేస్తున్నారు..అంతేకాకుండా చాలామంది ప్రజలు వాస్తు పండితుల సలహాలను కూడా తీసుకుంటున్నారు.. ఇంటి నిర్మాణం దగ్గర నుంచి పాదరక్షకాలు ఉంచే ప్రదేశం వరకు అన్ని వాస్తు ప్రకారం జరగాలని కోరుకుంటున్నారు. ప్రతిదీ వాస్తు ప్రకారం జరుగుతూనే ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి అనేది ఉంటుందని జనాలు నమ్ముతున్నారు..

అయితే కొంతమందికి కష్టపడి డబ్బులను సంపాదించినా కూడా చేతిలో డబ్బు అసలు నిలవదు. అలాంటివారు కొన్ని వాస్తు నియమాలను ప్రతిరోజు పాటించాలి. వీటిని అనుసరించడం వల్ల ధనవంతులు కావచ్చు. అలాంటి కొన్ని నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాయంత్రం పూట ఎంత దగ్గరివారైనా సరే పాలు, పెరుగు, ఉప్పు, నూనె అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో నివసించే వారి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది .

మంచం మీద కూర్చుని తినే అలవాటు ఫ్యాషన్ గా మారిపోయింది. ఇలా అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో నివసించే వారి అదృష్టం పూర్తిగా దూరమైపోతుంది. మీరు టేబుల్ లేదా కుర్చీ పై కూర్చొని తినవచ్చు. కానీ ఎప్పుడూ మంచం మీద కూర్చొని ఆహారం తినకూడదు. ముఖ్యంగా చెప్పాలంటే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చెత్త కుండీని అసలు ఉంచకూడదు. ఈ నియమాలను పాటిస్తే మీకు డబ్బుకు డోకా ఉండదు.. ఆర్థికంగా పుంజుకుంటారు..

Read more RELATED
Recommended to you

Latest news