వరంగల్ : నర్సంపేట సమాఖ్యకు కేంద్ర ప్రభుత్వ అవార్డు

-

వరంగల్ జిల్లా నర్సంపేట ఆదర్శ మండల సమాఖ్యకు కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్బర్ సంఘటన్ అవార్డ్ దక్కింది. ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా మంగళవారం రాత్రి అవార్డు అందుకున్నారు. రూ.1లక్ష నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని ఏపీఎం మహేందర్, సమాఖ్య అధ్యక్షురాలు శ్వేత తదితరులు అందుకున్నారు. నర్సంపేట సమాఖ్యకు అవార్డు రావడం పట్ల జిల్లా, డివిజన్ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news