వరంగల్: మేడారం నుండి ఇంటిబాట పడుతున్న జనం

-

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తుది ఘట్టానికి చేరడంతో భక్తజనం ఇంటిబాట పడుతున్నారు. అధికారులు, ఆలయ పూజారులు అమ్మవార్ల వన ప్రవేశానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇన్నిరోజులు భక్తులతో కిక్కిరిసిన మేడారం పరిసర ప్రాంతాలు బోసిపోనున్నాయి. వాహనాలన్ని ఒకేసారి రోడ్డు మీదకు రావడంతో ట్రాఫిక్ జామ్ కాకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. రెండు నెలల దర్శనం అనంతరం నేడు అమ్మవార్లు అడవిబాట పట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news