నల్గొండ : మఠంపల్లిలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

-

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి మఠంపల్లిలో జరిగిందని ఎస్ఐ రవి సోమవారం తెలిపారు. మఠంపల్లికి చెందిన వాకిటి అంజి(25) ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన అంజి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం హుజూర్ నగర్ హాస్పిటల్కి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news