పాదయాత్ర ముద్దులు పెట్టిన జగన్…ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నాడు : వంగలపూడి అనిత

-

అమరావతి : జగన్‌ మోహన్‌ సర్కార్‌, సీఎం జగన్‌ పై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి… మహిళా ద్రోహి అని.. పాదయాత్ర లో ముద్దులు పెట్టిన సీఎం జగన్ నేడు గుద్దులు గుద్దుతున్నారని నిప్పులు చెరిగారు వంగలపూడి అనిత. రెండున్నరేళ్ళు సీఎంలో మార్పు వస్తుందని ఆశించామని చురకలు అంటించారు. మద్యం ఎక్కువ రేట్లకు అమ్ముతూ మహిళల మెడలోని పుస్తెలు తెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వంగలపూడి అనిత.

ప్రతి రోజు మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయన్నారు. హోంమంత్రి సుచరిత నిస్సహాయ మంత్రి అని.. గన్ మ్యాన్ ల కోసమే సుచరితకు హోం మంత్రి పదవి అంటూ ఎద్దేవా చేశారు. విజయ వాడ బాలిక ఆత్మహత్య సంఘటనలో కావాలనే.. జగన్‌ సర్కార్‌ రాద్ధాంతం చేస్తుందని మండి పడ్డారు. ఈ సంఘటన లో నిందితున్ని తమ పార్టీ నుంచి.. ఇప్పటికే సస్పెండ్‌ చేశామని గుర్తు చేశారు వంగలపూడి అనిత.

Read more RELATED
Recommended to you

Latest news