ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం

-

ములుగు జిల్లాలోని గట్టమ్మ దేవాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు చెట్టును బలంగా ఢీ కొట్టడంతో కార్లో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానికుల సాయంతో క్షతగాత్రులను ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మేడారం జాతరకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news