విద్యార్థులకు గుడ్ న్యూస్..ఆ ఎగ్జామ్స్ రాసేవారికి ఓయో రూమ్స్..

-

ఇప్పుడు నీట్ పరీక్షలు జరుగనున్నాయి..పరీక్షలకు గడువు అతి కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో విద్యార్థుకు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.ఈ మేరకు ఓయో విద్యార్థినులకు భారీ ఆఫర్‌ ప్రకటించింది. ఈ ఏడాది జులై 17న జరిగే నీట్‌ ఎగ్జామ్‌ రాయనున్న విద్యార్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా తక్కువ ప్రైస్‌లో విద్యార్ధినులకు ఓయో రూమ్స్‌ అందిస్తుంది.

 

అందులో వైఫై, ఎయిర్‌ కండీషనింగ్‌ సౌకర‍్యం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (కన్జ్యూమర్‌) శ్రీరంగ్ గాడ్బోలే తెలిపారు.దేశ వ్యాప్తంగా 497 నగరాలు, పట్టణాల్లో కలిపి నీట్‌ ఎగ్జామ్‌-2022ను 10లక్షల మంది విద్యార్ధులు రాయనున్నారు.

ఈ తరుణంలో నీట్‌ ఎగ్జామ్‌ రాసే ప్రత్యేకంగా విద్యార్థినులకు ఓయో రూమ్స్‌ పై 60 శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా పరీక్షా సమయానికి హాలుకు వస్తారు. అంతేకాదు దూర ప్రాంతాల నుంచి వస్తూ ఇబ్బందులు పడే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఓయో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news