ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్డ్

-

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల తేదీలను ఐఐటీ బాంబే విడుదల చేసింది. ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం జూలై 3న జేఈఈ అడ్వాన్స్ఢ్ జరగాల్సి ఉంది. అయితే, నేషనల్ టెస్ట్ ఏజెన్సీ జెఈఈ మెయిన్ తేదీల్లో మార్పులు చేసింది. దీంతో అడ్వాన్స్డ్ తేదీలను మార్పు చేయాల్సి వచ్చింది. జూలై 30న జేఈఈ మెయిన్ చివరి విడత ముగుస్తుంది. ఆగస్టు 6న ర్యాంకులు వెల్లడించనున్నారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు ఆగస్టు 7న రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని ఐఐటీ బాంబే ప్రకటించింది. ఆగస్టు 28న అడ్వాన్స్ఢ్ పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులను సెప్టెంబర్ 11న వెల్లడిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news