బిగ్‌బాస్ ఫినాలే: సెకండ్ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసిన శ్రీకాంత్ – కేథరిన్‌

-

బిగ్‌బాస్ ఫినాలే ర‌స‌వ‌త్త‌రంగా జ‌రుగుతోంది. టాప్ 5 కంటెస్టెంట్ల‌లో ఇప్ప‌టికే అలీ రెజా బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. అలీని హీరోయిన్ రాశీఖ‌న్నా – ద‌ర్శ‌కుడు మారుతి హౌస్ లోప‌ల‌కు వ‌చ్చి బ‌య‌ట‌కు తీసుకు వెళ్లారు. ఇక అలీ అయితే ఓ దేవ‌త వ‌చ్చి న‌న్ను బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చినందుకు చాలా హ్యాపీగా ఉంద‌ని చెప్ప‌డం విశేషం. ఇక మిగిలిన న‌లుగురు కంటెస్టెంట్ల‌లో రెండో కంటెస్టెంట్‌ను బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చేందుకు సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ లోప‌ల‌కు వెళ్లాడు.

ముందుగా హౌస్‌లోకి శ్రీకాంత్ వెళ్ల‌గా… ఆ త‌ర్వాత హీరోయిన్ కేథ‌రిన్ థెస్రా కూడా వ‌చ్చింది. ఆమె ముందుగా వేదిక మీద రెండు పాట‌ల‌కు డ్యాన్స్ చేసిన అనంత‌రం లోప‌ల‌కు వెళ్లి… బిగ్‌బాస్ సీక్రెట్ క‌వ‌ర్ తీసుకుంది. అయితే ఆమె ఓపెన్ చేయ‌కుండానే శ్రీకాంత్‌కు ఇవ్వ‌గా నేరుగా వ‌రుణ్ మీద చేయి వేయ‌డంతో వ‌రుణ్ ఎలిమినేట్ అయ్యింద‌ని క్లారిటీ వ‌చ్చింది.

ఇక శ్రీకాంత్‌, కేథ‌రిన్ ఇద్ద‌రూ వ‌రుణ్‌ను బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చారు. ఇక వ‌రుణ్ గురించి కంటెస్టెంట్లు ఒక్కొక్క‌రు త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. అయితే వ‌రుణ్ ముందుగా బ‌య‌ట‌కు రావ‌డంతో వితిక కాస్త షాక్ అయ్యిన‌ట్లు ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చింది. ఇక ఇప్పుడు హౌస్‌లో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్ల‌లో ఒక‌రు విన్న‌ర్ అయితే మ‌రొక‌రు ర‌న్న‌ర్ అవుతారు. ఇక మ‌రొక‌రు ఎలిమినేట్ కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news