కేంద్ర బడ్జెట్ పూర్తి వివరాలు ఇవే.. ఏ శాఖకు ఎంతంటే..

-

నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో 2023 – 24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రసంగం మొదలైంది. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. వరుసగా ఐదవ సారి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్ లో పార్లమెంటు ముందుకు తీసుకువచ్చారు.

కేంద్రం ప్రధానంగా ఏడు ప్రాధాన్యత అంశాలను బడ్జెట్ లో చేర్చింది. అందులో సమ్మిళిత వృద్ధి, చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సమర్త్యాల వెలికితీత, స్వచ్ఛ పర్యావరణ అనుకూల అభివృద్ధి, యువశక్తి, విత్త విధానంలను కేంద్రం చేర్చింది. ఈ అంశాలపై స్పెషల్ ఫోకస్ చేయనున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్. ఈ బడ్జెట్ లో పేదల పై వరాల జల్లు కురిపించింది కేంద్రం. అయితే కేంద్ర బడ్జెట్ పూర్తి వివరాలు.. ఈ బడ్జెట్ లో ఏ ఏ శాఖకు ఎంత కేటాయించారో ఇప్పుడు తెలుసుకుందాం..

* పర్యాటక రంగ ప్రోత్సాహకానికి ప్రత్యేక చర్యలు, ఛాలెంజ్ విధానంలో దేశవ్యాప్తంగా 50 ప్రాంతాల ఎంపిక.. 50 టూరిస్ట్ స్పాట్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు.

* నిరుద్యోగం కోసం పీఎం కౌశల్ పథకం నాలుగో దశ ప్రారంభం, పీఎం కౌశల్ పథకం కింద నాలుగు లక్షల మందికి శిక్షణ, మూడేళ్ల పాటు 47 లక్షల మంది యువతకి స్టైఫండ్.

* విద్యుత్ రంగానికి రూ. 35 వేలకోట్ల కేటాయింపు.

* ఫైవ్ జి సేవల యాప్ లో అభివృద్ధి కోసం వంద పరిశోధనా సంస్థలు.

* ఈ కోర్టుల ఏర్పాటుకు ఏడు వేల కోట్లు.

* ఎంఎస్ఎంఈ లు, ఎన్జీవోలు, వ్యాపార సంస్థలకు డిజిలాకర్ సేవల విస్తరణ.

* కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు 75 వేల కోట్లు.

* ఫలితాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు నిధుల కేటాయింపు.

* ఏకలవ్య పాఠశాలలకు 38.800 మంది ఉపాధ్యాయుల నియామకం.

* పీఎం ఆవాస్ యోజనకు 79 వేల కోట్లు.

* రైల్వే శాఖకు 2.40 లక్షల కోట్ల కేటాయింపు.

* రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పడగింపు, వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ 13.7 లక్షల కోట్లు.

* గిరిజనుల కోసం పివి టీజీ పథకం ఏర్పాటు, నేషనల్ డిజిటల్ లైబ్రరీ వ్యవస్థకు ప్రోత్సాహం.

* ఫార్మా రంగా అభివృద్ధికి ప్రత్యేక పథకం.

* పరపతి సంఘాల డిజిటలైజేషన్ కు 2000 కోట్లు.

* రైతుల కోసం పదివేల బయో ఇన్పుట్ రిసోర్స్ కేంద్రాల ఏర్పాటు.

* పట్టణ మౌలిక వసతులు అభివృద్ధికి ప్రత్యేక నిధుల కింద ఏటా పదివేల కోట్లు.

* కర్ణాటక సాగు రంగానికి 5.300 కోట్లు సహాయం.

* డిజిటల్ ఇండియాకు అనుగుణంగా వన్ స్టాప్ ఐడెంటిటీ కేవైసీ విధానం.

* కృత్రిమ మేధా అభివృద్ధికి త్రి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లు ఏర్పాటు.

* రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు 75 వేల కోట్లు.

* నూతన వాహనాలకు కొనుగోలుకు రాష్ట్రాలకు సాయం, కేంద్ర ప్రభుత్వ వాహనాలు మార్చేందుకు ప్రత్యేక నిధులు, కాలం చెల్లిన వాహనాలు తొలగింపులకు తక్షణ ప్రాధాన్యత.

* శ్రీ అన్న పథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు ప్రోత్సాహం.

* వ్యవసాయ రుణాల కోసం 20 లక్షల కోట్లు.

Read more RELATED
Recommended to you

Latest news