వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి బ్యాంకులు బంపర్‌ ఆఫర్‌!

-

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రాణాంతకంగా మారుతోంది.ఈ వైరస్‌తో పోరాటం చేసి, మన ప్రాణాలను రక్షించుకోవడానికి ఇప్పటికే అన్ని దేశాలు టీకాలు ప్రారంభించాయి. అయితే, దేశీయ బ్యాంకులు కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నవారి కోసం బంపర్‌ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే వ్యాక్సిన్‌ తీసుకుంటే వివిధ బహుమతులు కూడా ఇస్తున్నాయి.ప్రస్తుతం బ్యాంకులు కూడా ఆ బాటలోనే వెళ్తున్నాయి. వివరాలు తెలుసుకుందాం.

covid19/ corona/ వ్యాక్సిన్‌

కొవిడ్‌ టీకా తీసుకున్న వారికోసం కొన్ని బ్యాంకులు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.అవి కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ రేటును వారి కోసం ప్రత్యేకంగా ప్రకటిస్తున్నాయి. దీంతో వినియోగదారులకు ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.కానీ, ఈ ఆఫర్‌ను కొంత కాలం వరకే ఉంది.

ఇప్పటికే శరవేగంగా విస్తురిస్తున్న కరోనా వైరస్‌తో అన్ని రంగాలు ఆర్థింగా దెబ్బతిన్నాయి.ప్రతి ఒక్కరూ ఎదో విధంగా కొవిడ్‌ వల్ల ప్రభావం పొందినవారే.ఇలాంటి సందర్భంలో కస్టమర్లకు బ్యాంకులు ప్రత్యేక ఆఫర్లతో ఆకట్టుకుంటున్నారు.ఒకవైపు వారికి ప్రత్యేవ వడ్డీ రేట్లతో బంపర్‌ ఆఫర్లు ఇస్తూనే మరోవైపు కొవిడ్‌ టీకా తీసుకోవడానికి వారిని ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా డబ్బులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకునే వారికి ఎక్కువ రాబడి వస్తుంది. అందుకే బ్యాంకులు ఈ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మొదటగా
ఈ ఆఫర్‌ను ప్రకటిస్తున్న బ్యాంక్‌ యూకో బ్యాంక్‌.తమ వినియోగదారులకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎక్కువ శాతం వడ్డీ రేటును అందిస్తోంది.సాధారణ వినియోగదారు కంటే వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి దాదాపు 0.03 శాతం అధిక వడ్డీని ప్రకటించింది.ఈ ఆఫర్‌ కేవలం 999 రోజుల ఎఫ్‌డీకే వర్తిస్తుంది.

ఆఫర్‌ కూడా సెప్టెంబర్‌ చివరి వరకే అందుబాటులో ఉండనుంది.ఈ విధంగా ఆఫర్‌ను ప్రకటిస్తోన్న మరో బ్యాంక్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.ఈ బ్యాంక్‌ కూడా టీకా తీసుకున్న వినియోగదారులకు ఎక్కువ శాతం వడ్డీ ఆఫర్‌ చేస్తోంది.ఇమ్యూన్‌ ఇండియా డిపాజిట్‌ స్కీమ్‌ పేరుతో వినియోగదారులకు కరోనా వ్యాక్సి¯Œ వేయించుకుంటే 0.25 శాతం ఎక్కువ వడ్డీని ప్రకటించింది. 1111 రోజుల ఎఫ్‌డీలకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news