మళ్ళీ భారీగానే నమోదయిన తెలంగాణా కరోనా కేసులు

-

తెలంగాణాలో మళ్ళీ భారీగానే కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కాస్త తగ్గినట్టు అనిపించిన కేసులు ఈరోజు మళ్ళీ పెరిగాయి. నిన్నటికే కరోనా కేసులు ఎనభై వేల మార్క్ ని క్రాస్ చేయగా ఈరోజు మరో 1,896 కేసులు నమోదయ్యాయి. తెలంగాణా వైద్యారోగ్య శాఖ రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 1,896 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటిదాకా నమోదయిన కేసులు 82,647కు చేరాయి. ఇక గత 24 గంటల్లో 08 మంది మృతి చెందగా ఇప్పటి దాకా కరోనా వలన చనిపోయిన వారి సంఖ్య 645కు చేరింది.

corona-positive
corona-positive

గడచిన 24 గంటల్లో 1,788 మంది కరోనా బారి నుండి కోలుకోగా ఇప్పటిదాకా కోలుకున్న వారి సంఖ్య 59,374కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 22,628 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి, ఇక ఇందులో 15,554 మంది హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. గడచిన 24 గంటల్లో 18,035 శాంపిల్స్ టెస్ట్ చేయగా ఇప్పటిదాకా 6,42,875 చేసినట్టయ్యింది. ఇక ఎప్పట్లానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో 338 కరోనా కేసులు నమోదు కాగా, రంగారెడ్డిలో 147 కేసులు, కరీంనగర్ లో 121 కేసులు, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 119 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news