ఇండియాలో కొత్తగా 2483 కేసులు… భారీగా పెరిగిన మరణాలు

-

దేశంలో కరోనా కేసుల తీవ్రత చాలా వరకు తగ్గింది. గత రోజులో పోలిస్తే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,483 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి బారిన పడి ఏకంగా 1,399 మంది మరణించారు. కరోనా మహమ్మారి నుంచి 1,970 మంది కోలు కున్నారు. కరోనా డైలీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 0.55గా ఉంది. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 15,636గా ఉంది.

దేశంలో కరోనా మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి మొత్తం కేసుల సంఖ్య 4,30,62,569కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,25,23,311 మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,23,622చేరింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం ఒక్క రోజు 22,83,224 టీకాలు అందించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు అర్హులైన  వారికి మొత్తంగా 1,87,95,76,423 డోసులను అందించింది ప్రభుత్వం.

 

Read more RELATED
Recommended to you

Latest news